Adimulapu Suresh: చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారు.. మంత్రి ఆదిమూలపు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కదా అందుకే.. చంద్రబాబుకు అన్ని వర్గాల మీద ప్రేమ పుట్టుకు వస్తుందని దుయ్యబట్టారు. అయినా టీడీపీ నాయకులకు సిగ్గు అనిపించటం లేదని మంత్రి ఆదిమూలపు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
చంద్రబాబు దళితుల పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మంత్రి ఆదిమూలపు అన్నారు. టీడీపీ నేతలకు దళితులు అంటే చిన్నచూపని.. చింతమనేని ప్రభాకర్, వర్ల రామయ్య, ఆది నారాయణ, చంద్రబాబు… దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు దళితులను అసహ్యించుకుంటుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నాడని తెలిపారు. జగనన్న మాదిగలకు పదవుల్లో అగ్రపీఠం, పథకాల్లో అగ్రస్ధానం ఇచ్చారన్నారు. సీఎం జగన్ డప్పు, చర్మ కళాకారుల పెన్షన్ను పెంచాడని తెలిపారు.
Read Also: AAA Cinemas: ‘పూజ’ పూర్తి.. ఓపెనింగ్ కి ఆల్ సెట్!
అంతేకాకుండా 2019 జనవరిలో డప్పు కళాకారులకు 1500 రూపాయలను చంద్రబాబు ఇచ్చారు.. ఎన్నికలకు మూడు నెలల ముందు 6 వేల మందికి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. అదే 2019లో జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలను 30 వేల మందికి ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు 56 వేల మందికి 3 వేలు ఇస్తున్న ప్రభుత్వం మాది అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దళిత సామాజిక వర్గానికి పెద్దపీఠ వేసి సాధికారత కల్పించే దిశలో అడుగులు వేసామని తెలిపారు. అందుకోసం దళితులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్క అవకాశం దొరికితే.. దళిత సామాజిక వ్యక్తులకు అవకాశం కల్పించాలనే తపనతో సీఎం జగన్ ఉంటారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..