Adimulapu Suresh: చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారు.. మంత్రి ఆదిమూలపు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కదా అందుకే.. చంద్రబాబుకు అన్ని వర్గాల మీద ప్రేమ పుట్టుకు వస్తుందని దుయ్యబట్టారు. అయినా టీడీపీ నాయకులకు సిగ్గు అనిపించటం లేదని మంత్రి ఆదిమూలపు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
చంద్రబాబు దళితుల పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మంత్రి ఆదిమూలపు అన్నారు. టీడీపీ నేతలకు దళితులు అంటే చిన్నచూపని.. చింతమనేని ప్రభాకర్, వర్ల రామయ్య, ఆది నారాయణ, చంద్రబాబు… దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు దళితులను అసహ్యించుకుంటుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నాడని తెలిపారు. జగనన్న మాదిగలకు పదవుల్లో అగ్రపీఠం, పథకాల్లో అగ్రస్ధానం ఇచ్చారన్నారు. సీఎం జగన్ డప్పు, చర్మ కళాకారుల పెన్షన్ను పెంచాడని తెలిపారు.
Read Also: AAA Cinemas: ‘పూజ’ పూర్తి.. ఓపెనింగ్ కి ఆల్ సెట్!
అంతేకాకుండా 2019 జనవరిలో డప్పు కళాకారులకు 1500 రూపాయలను చంద్రబాబు ఇచ్చారు.. ఎన్నికలకు మూడు నెలల ముందు 6 వేల మందికి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. అదే 2019లో జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలను 30 వేల మందికి ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు 56 వేల మందికి 3 వేలు ఇస్తున్న ప్రభుత్వం మాది అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దళిత సామాజిక వర్గానికి పెద్దపీఠ వేసి సాధికారత కల్పించే దిశలో అడుగులు వేసామని తెలిపారు. అందుకోసం దళితులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్క అవకాశం దొరికితే.. దళిత సామాజిక వ్యక్తులకు అవకాశం కల్పించాలనే తపనతో సీఎం జగన్ ఉంటారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!