Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chandrababu Speech In Paamarru Prajagalam Sabha

Chandrababu: పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు కొత్త హామీ

Published Date :April 7, 2024 , 6:40 pm
By Mahesh Jakki
Chandrababu: పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు కొత్త హామీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu: పామర్రు ప్రజాగళంలో రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త హామీని ప్రకటించారు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి పని చేస్తుందని.. ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాట ధర లేదు.. ధాన్యం కొనుగోళ్లు లేవు.. కూటమికి వన్ సైడుగా ఓటేయాలని ప్రజలను కోరారు. రైతును రాజుగా చేయడమే తన ఆలోచన అని పేర్కొన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం నీళ్లందివ్వలేకపోతోందని.. సీజన్ మిస్ కాకూడదని పట్టిసీమ తెచ్చామన్నారు.పోలవరం పూర్తి చేయాలి.. నదుల అనుసంధానం కావాలి.. కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లందించాలని తన కోరిక అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో నేను నీళ్లు పారిద్దామనుకుంటే.. జగన్ కన్నీళ్లు పారిస్తున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజం ఉండాలనేది ఎన్టీఆర్ సందేశం.. అదే తన ఆశయమన్నారు. జగన్‌ది రివర్స్ పరిపాలన అని.. అలాగే ప్రజల జీవితాలను రివర్స్ చేశారన్నారు. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పెడతామన్నారు. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలు తెస్తామని హామీలు గుప్పించారు. పామర్రులో ఐటీ టవర్ కడతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

పిల్లలను, యువతను గంజాయి బారిన పడేలా చేస్తోందీ ప్రభుత్వమంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలోని అన్ని కంపెనీలను యువత ముందు పెడతామన్నారు. కృష్ణా జిల్లా అనే తులసీవనంలో ఇప్పుడు గంజాయి మొక్కల మొలిచాయన్నారు. ఐదేళ్లల్లో ఒక్కసారైనా అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే భూములకు మంచి ధరలు వచ్చేవన్నారు. గుంతలు పూడ్చలేని జగన్.. మూడు రాజధానులను కడతారంట అంటూ ఎద్దేవా చేశారు. సంపద సృష్టించాలి.. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి.. ఇదే టీడీపీ విధానమన్నారు. చిన్న పని చేయాలన్నా.. హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. టీడీపీ కంటిన్యూ అయి ఉంటే హైదరాబాదుకు ధీటుగా అమరావతి అభివృద్ది అయ్యేదన్నారు. జగన్ తన పాలనను విధ్వంసంతో మొదలు పెట్టాడని.. వైసీపీ ఇచ్చే ఎంపీ సీటు వద్దని బాలసౌరీ బయటకొచ్చేశారన్నారు. కుమార్ రాజాకు కోట్లు లేవు.. వేసుకునే కోటూ లేదు. కానీ వర్ల రాజాకే దండ వేశానన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కొనకళ్లకు టిక్కెట్ ఇవ్వలేకపోయానన్నారు. కొనకళ్ల ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదన్నారు.

టిక్కెట్ ఇవ్వలేకపోయినా దేవినేని ఉమ సైనికుడిలా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి వాళ్లని తాను మరువగలనా అని పేర్కొన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటా.. వాళ్లని మరిచిపోగలనా అంటూ తెలిపారు. వైసీపీలో పార్థసారధి ఇమడలేకపోయారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ..”జగనుకు డబ్బున్నోళ్లు కావాలి.. గంజాయి బ్యాచ్ కావాలి.. టీడీపీకి మంచి వాళ్లు కావాలి. ఇవాళ అన్న క్యాంటీన్లు ఉన్నాయా..? ఎస్సీ పథకాలు ఉన్నాయా..?. ఎస్సీలకు అందాల్సిన ఎన్నో పథకాలను రద్దు చేశారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి.. జగన్ తన పేరు పెట్టుకున్నారు. జగవ్ అంబేద్కర్ కంటే గొప్పవాడా..?. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు. గుడివాడ గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి.. ఆడపిల్లలను వేధిస్తున్నారు. గంజాయి బ్యాచుపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడి పైనే కేసులు పెట్టారు. నా మీదే కేసులు పెట్టారు.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Chandrababu Speech
  • latest news
  • Prajagalam Sabha

తాజావార్తలు

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

  • Kaushik Reddy : అందుకోసం నేను అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతా

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions