CM Chandrababu: స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే అన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందన్నారు. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందరని చెప్పారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయిందని తెలిపారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారన్నారు. చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం… చెత్తననూ తొలగించామన్నారు.
READ MORE: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి!
Also Read
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. “జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్లను గౌరవించుకోవాలి. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద… ఇలా అన్ని చోట్లా పరిశుభ్రతే కన్పించాలి. స్వచ్ఛమైన, పచ్చనైనా, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పని చేద్దాం. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. సింగపూర్ దేశంలో స్వచ్చత పై అధ్యయనం చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అమలు చేశాం. రాత్రిపూట క్లీనింగ్ విధానం కూడా అమలు చేశాం. గ్రీన్ పాస్ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్ అండ్ త్రో పాలసీ కాదు… యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ అమలు చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!