CM Chandrababu: స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే అన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందన్నారు. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందరని చెప్పారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయిందని తెలిపారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారన్నారు. చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం… చెత్తననూ తొలగించామన్నారు.
READ MORE: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. “జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్లను గౌరవించుకోవాలి. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద… ఇలా అన్ని చోట్లా పరిశుభ్రతే కన్పించాలి. స్వచ్ఛమైన, పచ్చనైనా, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పని చేద్దాం. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. సింగపూర్ దేశంలో స్వచ్చత పై అధ్యయనం చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అమలు చేశాం. రాత్రిపూట క్లీనింగ్ విధానం కూడా అమలు చేశాం. గ్రీన్ పాస్ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్ అండ్ త్రో పాలసీ కాదు… యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ అమలు చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!