Chandrababu: సమష్టిగా కలిసి పని చేద్దాం.. ఏపీని తిరిగి గాడిలో పెడదాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది.. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్లు ఈ బహిరంగ సభ వేదికగా కీలక ఉపనస్యాలు చేసిన విషయం విదితమే కాగా.. ఇక, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఏపీ వాసులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.. సమష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పని చేద్దాం అన్నారు.. ప్రజాగళానికి కదిలి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజా మద్దతుతో వారి హక్కుల కోసం పోరాడి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందన్నారు.. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు..
Read Also: Electoral Bonds : డీఎంకేకి భారీగా విరాళమిచ్చిన లాటరీ కింగ్.. పార్టీకి వచ్చిన వాటిలో ఆయనదే టాప్
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
కాగా, ప్రాంతీయ ఆకాంక్షలు, దేశ ప్రగతి ప్రాతిపదికన ఎన్జీఏ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో విద్యాసంస్థలను కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాం.. తిరుపతిలో ఐఐటీ, ఐఎస్సార్, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఐఐపీఈ, ఎయిమ్స్ నిర్మించామని, విజయనగరం జిల్లాలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం అన్నారు.. మరోవైపు విపక్షాలపై విమర్శలు సంధించిన ఆయన.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.. ఇక, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ.. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు అని గుర్తు చేశారు.. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే
I thank everyone who joined us at the #Prajagalam in Palnadu today. Your overwhelming support further strengthens our resolve to fight for your rights and create a brighter future for our State. Together, we shall win. Together, we shall put our beloved Andhra Pradesh back on the… pic.twitter.com/WI6JgAS17A
— N Chandrababu Naidu (@ncbn) March 17, 2024
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!