Chandrababu Naidu: మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి ఇస్తాం: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manifesto will be released soon Says Chandrababu: సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని, సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
‘దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామనుకునే వైసీపీ నేతల ఆటలు ఇక సాగవు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ. సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి అందిస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి రూ. 1500 ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచితం, ఏడాదికి 3 సిలండర్లు ఇస్తాం. అన్నదాత కింద రైతులకు రూ.20 వేలు అందజేస్తాం. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
Also Read: Chandrababu Naidu: టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్: చంద్రబాబు
‘దేశంలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. టీడీపీ ఉద్యోగాలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు. టీడీపీ-జనసేన క్యాడర్ ప్రజలను చైతన్యం చేయాలి. రౌడీయిజం చేసి, డబ్బులు ఖర్చు పెట్టీ మరోసారి గెలుస్తా అని జగన్ అనుకుంటున్నాడు. అవన్నీ కుదరవు. తెలంగాణ వెళ్లి మద్యం తాగి వస్తున్న పరిస్థితి నెలకొంది. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఏపీలో పెట్టారు. సీఎం రంగుల పిచ్చోడు. ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. పొలంలో సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటో ఉంటుంది. తాతలు ఇచ్చిన ఆస్తులపై, పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫోటోనా. జగన్ ఏమన్నా వారి తండ్రి, తల్లి తరపు బంధువా? ఫొటో వేయటానికి. చివరకు మరుగు దొడ్ల మీద కూడా జగన్ ఫోటో ఉంది. ఈ ఫోటో రానున్న రోజుల్లో మరుగ దొడ్ల లోపల కూడా వేస్తారు?’ అని చంద్రబాబు విమర్శించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!