Chandrababu Naidu: టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై బాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వెలువడుతున్న ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరిగింది. టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. తాజా ఫలితాలపై విశ్లేషించారు. టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సీఎం ఢిల్లీ పర్యటన పైనా ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. నేతలతో చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు.
Read Also:TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
Also Read
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులంతా కష్టపడ్డారు. ప్రజల మద్దతు మన పక్షానే అని తేలింది.ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు లొంగలేదు.ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది.ఇదే స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి.హడావుడిగా ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి ఏం తెచ్చారో ఈసారైనా చెబుతారా..అన్నారు చంద్రబాబు. ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు చూస్తేనే ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు.ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవనేది ఈ ఎన్నికల ఫలితాలే సంకేతం.నీరో చక్రవర్తి తరహాలో జగన్ ప్రభుత్వం కూడా నాశనం కావడం ఖాయం.విశాఖ రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
కోర్టు పరిధిలో ఉండగా విశాఖ రాజధాని గురించి మాట్లాడ్డం తప్పు.పార్లమెంటులో సవరణ జరిగితే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదు.ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో రాజధానిని కోరుకోవడం లేదు.వైసీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారు.వైసీపీ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు.వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు ఉత్తరాంధ్ర వ్యతిరేకంగా ఓటేశారన్నారు యనమల.
Read Also: IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ ఒంటరి పోరు.. ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!