Chandrababu Naidu: టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై బాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వెలువడుతున్న ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరిగింది. టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. తాజా ఫలితాలపై విశ్లేషించారు. టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సీఎం ఢిల్లీ పర్యటన పైనా ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. నేతలతో చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు.
Read Also:TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
Also Read
- Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
- Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులంతా కష్టపడ్డారు. ప్రజల మద్దతు మన పక్షానే అని తేలింది.ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు లొంగలేదు.ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది.ఇదే స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి.హడావుడిగా ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి ఏం తెచ్చారో ఈసారైనా చెబుతారా..అన్నారు చంద్రబాబు. ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు చూస్తేనే ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు.ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవనేది ఈ ఎన్నికల ఫలితాలే సంకేతం.నీరో చక్రవర్తి తరహాలో జగన్ ప్రభుత్వం కూడా నాశనం కావడం ఖాయం.విశాఖ రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
కోర్టు పరిధిలో ఉండగా విశాఖ రాజధాని గురించి మాట్లాడ్డం తప్పు.పార్లమెంటులో సవరణ జరిగితే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదు.ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో రాజధానిని కోరుకోవడం లేదు.వైసీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారు.వైసీపీ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు.వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు ఉత్తరాంధ్ర వ్యతిరేకంగా ఓటేశారన్నారు యనమల.
Read Also: IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ ఒంటరి పోరు.. ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు
తాజావార్తలు
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?