Palla Srinivas Yadav: ఏపీ టీడీపీకి కొత్త చీఫ్.. పల్లా శ్రీనివాస్ యాదవ్కు బాధ్యతలు..
- ఏపీ టీడీపీకి కొత్త బాస్ను నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు
- ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం
- సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్ యాదవ్
- రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ యాదవ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Srinivas Yadav: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత.. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు.. మరోవైపు పార్టీని చక్కదిద్దే పనిలో పడిపోయారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీకి కొత్త బాస్ను నియమించారు చంద్రబాబు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను నియమించారు.. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్ యాదవ్.. తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ యాదవ్ రికార్డు సృష్టించాడు.. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు.
Read Also: No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ఇక, యాదవ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నట్టుగా తెలుస్తోంది.. తన మంత్రి వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి చోటు కల్పించిన ఆయన.. టీడీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా యాదవ వర్గం చేతిలోనే పెట్టారు.. దీంతో.. యాదవ సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి 95 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు పల్లా శ్రీనివాస్ యాదవ్.. ఆయన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.. కానీ, పల్లా శ్రీనివాస్ యాదవ్.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు.. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపై మరింత కేంద్రీకరించి పనిచేశారు.. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు.. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో.. పల్లా శ్రీనివాస్ యాదవ్కు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పచెప్పారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!