Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తిన బాట..! పొత్తులపై కొనసాగుతోన్న సస్పెన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: నేడు ఢిల్లీ బీజేపీ పెద్దల్ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులపై మంతనాలు జరుపనున్నారు. ఏపీలో పొత్లులపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతోంది. టీడీపీ-జనసేనతో పొత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేనలు తొలి జాబితాను ప్రకటించడమే కాకుండా ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్తున్నాయి. ఎన్డీఏలో ఉన్న జనసేన మరోవైపు టీడీపీ సైతం కచ్చితంగా బీజేపీతో పొత్తు ఉంటుందని పదేపదే చెబుతున్నాయి. కానీ ఢిల్లీలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.ఈ విషయంలో మరోసారి అగ్రనేతలతో పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోమువీర్రాజులు సమావేశం కాబోతున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఇవాళ ఢిల్లీ పెద్దలతో పొత్తులపై చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
Read Also: Jasmin Tea : జాస్మిన్ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే రోజూ తాగుతారు..
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
నిన్న దాదపు గంటన్నరసేపు చంద్రబాబు – పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలతో పాటు.. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కూటమి పార్టీల అధినేతలు కసరత్తు చేసినట్టు సమాచారం. వీలైనంత త్వరగా రెండో విడత జాబితాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించి చర్చించారు. అలాగే ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించాల్సి అంశాలపై నేతలు డిస్కస్ చేశారు. పొత్తు కుదిరితే ఎన్ని కేటాయించాలి వంటి అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ హైకమాండ్ మాత్రం పొత్తుపై ఎటు తేల్చకుండా గందరగోళంలో పడేసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా హైకమాండ్దే తుది నిర్ణయం అని ప్రకటించేసింది. నిన్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్నారు నేతలు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా క్లారిటీ వస్తుందేమోనని చూస్తున్నారు.
Read Also: Postal Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..
మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొత్తుల విషయంలో వెంటనే క్లారిటీ రావాలని ఆశిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తే సీట్లు కేటాయించి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్లారిటీ కోసం ఇవాళ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు చంద్రబాబు కూడా హస్తినకు పయనమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..