KTR: మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం.. విచారణకు పిలవనున్న ఏసీబీ
- కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలవనున్న ఏసీబీ
- కాసేపట్లో మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం
- కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై న్యాయనిపుణులతో ఏసీబీ సమావేశం
- విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినందున..
- మరోసారి నోటీస్ ఇవ్వాలని ఏసీబీ నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్కి గుడ్న్యూస్.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
ఇదిలా ఉంటే.. కేటీఆర్ని మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ నిర్ణయించింది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై లీగల్ టీంతో ఏసీబీ భేటీ అయింది. విచారణకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు చెప్పినందున మళ్లీ పిలవాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ లేఖ పై ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆర్డర్లో ఉన్న కేటీఆర్ విచారణకు రాకపోవడం పై ఏసీబీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. కేటీఆర్ దర్యాప్తునకు సహకరించడం లేదన్న విషయాన్ని ఏసీబీ హైకోర్టు ముందు ప్రస్తావించనుంది. ఈ క్రమంలో.. తదుపరి లీగల్ చర్యలకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటుంది. కేటీఆర్కు మరోసారి నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ టీమ్ సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!