KTR: మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం.. విచారణకు పిలవనున్న ఏసీబీ
- కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలవనున్న ఏసీబీ
- కాసేపట్లో మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం
- కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై న్యాయనిపుణులతో ఏసీబీ సమావేశం
- విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినందున..
- మరోసారి నోటీస్ ఇవ్వాలని ఏసీబీ నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్కి గుడ్న్యూస్.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
ఇదిలా ఉంటే.. కేటీఆర్ని మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ నిర్ణయించింది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై లీగల్ టీంతో ఏసీబీ భేటీ అయింది. విచారణకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు చెప్పినందున మళ్లీ పిలవాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ లేఖ పై ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆర్డర్లో ఉన్న కేటీఆర్ విచారణకు రాకపోవడం పై ఏసీబీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. కేటీఆర్ దర్యాప్తునకు సహకరించడం లేదన్న విషయాన్ని ఏసీబీ హైకోర్టు ముందు ప్రస్తావించనుంది. ఈ క్రమంలో.. తదుపరి లీగల్ చర్యలకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటుంది. కేటీఆర్కు మరోసారి నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ టీమ్ సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!