ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్... అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు. అయితే.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.
నంది నగర్లోని తన ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు. మరోవైపు.. కేటీఆర్ ఇంటి వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా నేతలంతా అక్కడకు చేరుకున్నారు.