Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి.. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ రోజు ఏలూరులో పర్యటించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పలు సూచనలు చేశారు.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలు అమలు చేయాలన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేశారు. ఇక, తన పర్యటనలో ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ గదులను కూడా పరిశీలించారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.
Read Also: Young Indians: భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
కాగా, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు మే 13వ తేదీన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ వరకు జరిగే ఏడు దశల ఎన్నికల ప్రక్రియలో.. మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.. ఇక, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!