Duleep Trophy: ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సెంచరీలు.. యువ ఆటగాళ్ల విధ్వంసం
- దులీప్ ట్రోఫీలో ధీటుగా రాణిస్తున్న భారత యువ ఆటగాళ్లు
- దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభం
- ఇండియా A.. ఇండియా D మధ్య గట్టి పోటీ
- సెంచరీలతో చెలరేగిన ప్రథమ్ సింగ్.. తిలక్ వర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు చెన్నైలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం టీమిండియా చెమటోడ్చుతుంటే.. మరోవైపు దులీప్ ట్రోఫీలో భారత యువ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇండియా A, ఇండియా D మధ్య గట్టి పోటీ కనిపించింది. ఇండియా B, ఇండియా C తలపడుతున్నాయి. శనివారం భారత్ D ముందు 488 పరుగుల లక్ష్యం ఉంది. ఈ క్రమంలో.. స్టంప్స్ సమయానికి యష్ దూబే15 పరుగులతో నాటౌట్గా ఉండగా, రికీ భుయ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత్ డి స్కోరు 62/1 ఉంది. మరోవైపు.. భారత్ బి, భారత్ సి మధ్య బలమైన పోటీ నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ బి 101 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 216 పరుగుల వెనుకంజలో ఉంది.
Minister Ram Prasad Reddy: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని ఇండియా ఎ జట్టు భారత్ డిపై పైచేయి సాధించింది. శనివారం ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగారు. భారత్ ఎ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ప్రథమ్ సింగ్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 122 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు.. తిలక్ వర్మ తొమ్మిది ఫోర్ల సహాయంతో 111 పరుగులు సాధించాడు. తిలక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది ఐదో సెంచరీ. ప్రస్తుతం నాటౌట్గా ఉన్న అతను శాశ్వత్ రావత్ (64 పరుగులు)తో కలిసి క్రీజులో ఉన్నాడు.
House Collapsed: మీరట్లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!
అనంతపురంలో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ బి పరిస్థితి కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అభిమన్యు ఈశ్వరన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 309/7 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 143 పరుగులు చేసి నాటౌట్గా ఇంకా పోరాడుతున్నాడు. రాహుల్ చాహర్ (18* పరుగులు) అతనికి మద్దతుగా ఉన్నాడు. నారాయణ్ జగదీషన్ 70, సర్ఫరాజ్ ఖాన్ 16, రింకూ సింగ్ 6, నితీష్ కుమార్ రెడ్డి 2, వాషింగ్టన్ సుందర్ 13, సాయి కిషోర్ 21 పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!