IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
- DGCA ఇప్పటికే ఇండిగోకి నోటీసులు జారీ చేసింది
- అలాగే ప్రయాణికులకు రూ.750 కోట్లను రిఫండ్ చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: పార్లమెంట్లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో, సీవోవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికులకు రూ.750 కోట్లను వెనక్కి ఇప్పించామని వెల్లడించారు.
READ ALSO: Telangana Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్లో పలు కంపెనీలతో ప్రభుత్వం పెట్టుబడులు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఆయన మాట్లాడుతూ.. క్రమంగా ఎయిర్పోర్టుల్లో పరిస్థితులు సాధారణస్థితికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రయాణికులకు రిఫండ్, లగేజీలను చేర్చే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని, డీజీసీఏ ఇండిగో యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని స్పష్టం చేశారు.
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్పై ఆయన స్పందిస్తూ.. ఈ సంస్కరణలు ప్రయాణికుల భద్రతను పెంచుతాయని, అలాగే పైలట్ల అలసటను దృష్టిలోపెట్టుకొని శాస్త్రీయ పద్ధతుల్లో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి డీజీసీఏ ముందుగా అన్ని విమానయాన సంస్థలతో మాట్లాడిన తర్వాతే ఈ సంస్కరణలను క్రమక్రమంగా అమలు చేస్తోందని వివరించారు. 2025 జులై ఒకటి నుంచి తొలి దశ, నవంబర్ ఒకటి నుంచి రెండో సంస్కరణలను అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి ఈ నిబంధనలను ఇండిగో కూడా పాటిస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. అయితే ఇండిగో హామీ మాత్రం ఇచ్చిందని కానీ, ఈ సంస్థ రోస్టరింగ్ నియమాలను అమలు చేయడంలో విఫలం కావడంతో దీని ఫలితం ఆ సంస్థ సర్వీసుల రద్దుకు కారణం అయినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి కేంద్రం తావివ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రంగంలోకి కొత్త సంస్థలు అడుగుపెట్టడానికి ఇదే మంచి టైం అని మరోసారి ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇండిగో సర్వీసులు రద్దు అయిన టైంలో మిగిలిన విమానాల టికెట్ ఛార్జీలపై పరిమితులు విధించామని ఆయన గుర్తుచేశారు.
READ ALSO: Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!