Himachal Pradesh: వరదలతో హిమాచల్ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్ప్రదేశ్కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది. జూలై 10, 17 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి చెందిన కేంద్ర వాటా నుంచి రూ.360.80 కోట్ల ముందస్తు విడుదలకు కేంద్రం గతంలో ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి గత బకాయిల్లో రూ.189.27 కోట్లను ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో బాధిత ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుండి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాన్స్గా కూ. 200 కోట్లను విడుదల చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని అధికార ప్రతినిధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తోందని, పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన లాజిస్టిక్స్, ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోందని పేర్కొన్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Read Also: Smart Phones : మొబైల్ పౌచ్ లో ఇలాంటి పెడితే ఇక అంతే.. ఫోన్ పేలిపోవడం ఖాయం..
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 20 బృందాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన తొమ్మిది కాలమ్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మూడు హెలికాప్టర్లు హిమాచల్ ప్రదేశ్లో రెస్క్యూ, రిలీఫ్ కోసం మోహరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి మెమోరాండం కోసం ఎదురుచూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితి, సహాయక చర్యలపై అక్కడికక్కడే అంచనా వేయడానికి అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను కూడా నియమించిందని ప్రతినిధి తెలిపారు. జూలై 19 నుంచి 21 వరకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.
హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుల కారణంగా కనీసం 330 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 12 జిల్లాలు ఈ రుతుపవనాల కారణంగా వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘావృతాల కారణంగా దెబ్బతిన్నాయి. గత వారంలో రాష్ట్రంలో 25 కొండచరియలు విరిగిపడటం, ఒక క్లౌడ్బర్స్ట్ సంభవించినట్లు డేటా తెలిపింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!