Central Election Commission: ఏపీలో హింసాత్మక ఘటనలు.. చర్యలకు దిగిన సీఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Election Commission: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త FIR రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ.. సీఎస్, డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల ఇష్యూ ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై రిపోర్టు ఇవ్వాలన్న ఆదేశంలో.. ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీలు హరీశ్ కుమార్ గుప్తాలు ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. దాదాపు అర గంట పాటు అధికారులతో సమావేశం జరిగింది. పూర్తి వివరాలతో కూడిని రిపోర్ట్ను ఈసీకి అందించారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గొడవలను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్, డీజీపీపై మండిపడింది. హింసకు తావు లేకుండా చూడాలని గతంలో ఈసీ పలు మార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై రిపోర్టు ఇచ్చారు. ఇక, కాస్త సమయం తీసుకుని చర్యలకు దిగింది కేంద్ర ఎన్నికల కమిషన్.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!