Karnataka Elections : ఈ నెల 10న కర్ణాటక ఎన్నికలు.. సరిహద్దు రాష్ట్రాలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరగనున్న కర్ణాటకతో సహా ఆరు దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కర్ణాటక రాష్ట్రానికి పూర్తి సహకారం అందించాలని సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను సీఈసీ ఆదేశించారు. ప్రతి సరిహద్దు రాష్ట్రం ద్వారా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు చేసిన ఏర్పాట్లను ECI సమీక్షించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందుకు చెక్పోస్టులను పెంచాలని, పెట్రోలింగ్ను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, మొబైల్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయాలి. బోగస్ ఓటర్ల పరిశీలన చేపట్టాలి.
Also Read : Off The Record: హాట్టాపిక్గా మారిన బాలినేని వ్యవహారం..! వైసీపీలో ప్రకంపనలు
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ముఖ్యంగా పోలింగ్కు ముందు చివరి 72 గంటల సమయంలో కర్ణాటకకు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఉంచాలి. సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపును నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘం సభ్యులకు వివరించారు. కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని సి.ఎస్ హామీ ఇచ్చారు. కర్ణాటక సరిహద్దు జిల్లాల నుండి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్ లు పెంచుతున్నామని, కట్టుదిట్టమైన నిఘా నిర్వహించబడుతుందని సీఎస్ పేర్కొన్నారు.
Also Read : Nora Fatehi: ఏవమ్మా .. మనోహరీ.. అసలే ఎండాకాలం.. నువ్వింకా హీట్ పెంచాలా
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!