JD Lakshminarayana New Political Party: జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Lakshminarayana New Political Party: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది.. వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి.. అయితే, దీనిపై కూడా తేల్చేశారు లక్ష్మీనారాయణ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా పోటీ చేస్తానని.. అదికూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగనున్నట్టు గతంలో చెప్పారు.. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు దరఖాస్తు చేసుకోవడం.. పార్టీ పేరు కూడా ఖరారు అయ్యిందని.. ఇక ప్రకటనే మిగిలింది అంటున్నారు..
అయితే, వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగులు వేసిన లక్ష్మీనారాయణ ఓ దశలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతారనిపించింది.. విద్యావంతులు, యువతలో వచ్చిన క్రేజ్ దానికి కారణం.. అయితే, ఎంత వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా ఉండాలని కావున.. గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు.. గ్లాసు గుర్తుపై విశాఖ లోక్సభ ఎంపీగా బరిలోకి దిగారు.. 2.80 లక్షలకు పైగా ఓట్లు సాధించినా విజయం దక్కలేదు.. ఆ తర్వాత జనసేనకు గుడ్బై చెప్పిన వీవీ.. నాలుగున్నరేళ్లుగా విశ్లేషకుడిగా మారిపోయారు. అయితే, తనకు కలిసివచ్చే ఏ వేదికను కూడా ఆయన వదలడంలేదు.. నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అందరికీ మరింత చేరువగా వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేయడం పక్కా అని తేల్చేసిన ఆయన.. ఇప్పుడు మరో పార్టీలో చేరడం ఏంటి? అనే ఉద్దేశంతో కొత్త పార్టీ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారట.. అందులో భాగంగానే ఆరు నెలల క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ‘జై భారత్ నేషనల్పార్టీ’ పేరుతో దరఖాస్తు పెట్టుకున్నారట..
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
మరోవైపు.. గురువారం రాత్రి విజయవాడలోని ఓ హోటల్లో భావసారూప్యత కలిగిన వారితో వీవీ సమావేశమై తన కార్యాచరణపై చర్చించారట.. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ సమావేశానికి “అర్ధరాత్రి ఆలోచన” అని పిలిచారట.. ఆ భేటీ శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్టు తెలుస్తోంది.. అర్ధరాత్రి దాటిన తర్వాతే సమావేశం ఎందుకు జరిగింది? అని ప్రశ్నిస్తే భారతదేశానికి స్వాతంత్ర్య ప్రకటనతో సహా దేశంలోని అన్ని ప్రధాన పరిణామాలు అర్ధరాత్రి తర్వాత మాత్రమే జరిగాయి. అందుకే అర్థరాత్రి దాటిన తర్వాతే ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అంటూ మాజీ జేడీ మీడియాతో వ్యాఖ్యానించారు. డబ్బు, కుల, వంశ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. “ఏ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజల గురించి పట్టించుకోవడం మానేసి వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు” అని దయన దుయ్యబట్టారు. ఓటర్లను ప్రకాశవంతం చేయడం ద్వారా రాజకీయాలను సమూలంగా మార్చాలని సీబీఐ మాజీ అధికారి పిలుపునిచ్చారు. పరిపాలనలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజలకు తెలిసేలా మాకు పారదర్శక ప్రభుత్వం అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు.. అయితే, ఈ రోజు రాత్రి 7.30 గంటలకు విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు లక్ష్మీ నారాయణ.. దీంతో.. జేడీ లక్ష్మీనారాయణ కీలక రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో.. సీబీఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!