Sandeshkhali Case: తొలి ఛార్జిషీటు దాఖలు.. నిందితులపై హత్యాయత్నం కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో తొలి ఛార్జ్షీటును సీబీఐ దాఖలు చేసింది. ఇక ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ సహా నిందితులందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. బసిర్హత్ ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జ్ షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన సంబంధాలు, రాష్ట్ర మాజీ ఆహార మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్తో సంబంధాలతో సహా షాజహాన్, అతని సహచరులపై వచ్చిన ఆరోపణలపై ఛార్జ్షీటులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Tirumala Special Days In June: జూన్ 2024 తిరుమలలో ప్రత్యేక రోజుల వివరాలు ఇలా..
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
జనవరి 5న సందేశ్ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై షాజహాన్ సహచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అనంతరం టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని సోదరుడు, మరో ఐదుగురిపై సీబీఐ నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కింద అభియోగాలు మోపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో తొలి ఛార్జిషీటును బసిర్హత్ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసినట్లు వారు తెలిపారు. హాజహాన్ షేక్, అతని సోదరుడు అలోమ్గిర్, సహచరులు జియావుద్దీన్ మొల్లా, మఫుజర్ మొల్లా, దిదర్బక్ష్ మొల్లా సహా ఏడుగురిపై చార్జ్షీట్ ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్డేట్..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం
నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 307 (హత్యాయత్నం) అల్లర్లు, చట్టవిరుద్ధమైన అనేక ఇతర అభియోగాలు నమోదు చేసింది. కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో సందేశ్ఖాలీ ప్రాంతం ఉంది. హాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు మహిళలు ఆరోపించారు. జనవరి 5న జరిగిన ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఫిబ్రవరి 29న షాజహాన్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా.. మార్చి 6న సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.
ఇక సందేశ్ఖాలీ బాధితులను ప్రధాని మోడీ పరామర్శించి ఓదార్చారు. అంతేకాకుండా బాధితురాలికి లోక్సభ సీటు కూడా బీజేపీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్లు..
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!