Sandeshkhali Case: తొలి ఛార్జిషీటు దాఖలు.. నిందితులపై హత్యాయత్నం కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో తొలి ఛార్జ్షీటును సీబీఐ దాఖలు చేసింది. ఇక ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ సహా నిందితులందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. బసిర్హత్ ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జ్ షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన సంబంధాలు, రాష్ట్ర మాజీ ఆహార మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్తో సంబంధాలతో సహా షాజహాన్, అతని సహచరులపై వచ్చిన ఆరోపణలపై ఛార్జ్షీటులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Tirumala Special Days In June: జూన్ 2024 తిరుమలలో ప్రత్యేక రోజుల వివరాలు ఇలా..
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
జనవరి 5న సందేశ్ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై షాజహాన్ సహచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అనంతరం టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని సోదరుడు, మరో ఐదుగురిపై సీబీఐ నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కింద అభియోగాలు మోపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో తొలి ఛార్జిషీటును బసిర్హత్ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసినట్లు వారు తెలిపారు. హాజహాన్ షేక్, అతని సోదరుడు అలోమ్గిర్, సహచరులు జియావుద్దీన్ మొల్లా, మఫుజర్ మొల్లా, దిదర్బక్ష్ మొల్లా సహా ఏడుగురిపై చార్జ్షీట్ ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్డేట్..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం
నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 307 (హత్యాయత్నం) అల్లర్లు, చట్టవిరుద్ధమైన అనేక ఇతర అభియోగాలు నమోదు చేసింది. కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో సందేశ్ఖాలీ ప్రాంతం ఉంది. హాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు మహిళలు ఆరోపించారు. జనవరి 5న జరిగిన ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఫిబ్రవరి 29న షాజహాన్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా.. మార్చి 6న సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.
ఇక సందేశ్ఖాలీ బాధితులను ప్రధాని మోడీ పరామర్శించి ఓదార్చారు. అంతేకాకుండా బాధితురాలికి లోక్సభ సీటు కూడా బీజేపీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్లు..
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!