Bihar Caste survey: బీహార్లో కులగణన సర్వే నివేదిక విడుదల.. ఓబీసీ, ఈబీసీలు 63%
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఈ నివేదికను రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బీహార్ లో జనాభా దాదాపు 13.07 కోట్లు ఉన్నారు. అందులో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారి వాటా 27.13 శాతంగా ఉన్నట్లు రిపోర్డులో తేలింది. ఇక.. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని రిపోర్టు తెలిపింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల (SCs) జనాభా 19.7 శాతం ఉండగా.. షెడ్యూల్డ్ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Vande Bharat Express: వందేభారత్ రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. ట్రాకుపై రాళ్లు, ఇనుపకడ్డీలు…
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం చేసిన వ్యాఖ్యలపై.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. తమ రాష్ట్రంలో కులగణన చేపడతామని గత ఏడాది జూన్లో తెలిపారు. దీంతో ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని న్యాయస్థానం కొట్టివేసి సర్వేకు అనుమతించింది. అంతటితో ఆగకుండా ఈ విషయం సుప్రీంకోర్టు తలుపులను కూడా తట్టింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.
PM Modi: ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి
కులగణన నివేదిక నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామని.. ఓబీసీ కోటా పెంపు సహా ఇతర అంశాలపై సమాలోచనలు జరుపుతామని నితీశ్ కుమార్ తెలిపారు.
- Tags
- bihar
- Caste survey
- ebc
- OBC
- release
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!