NTV Telugu Site icon

CM Siddharamiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..

Siddaramaiah

Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతకుముందు.. సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో.. చర్య తీసుకున్నారు. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నేతృత్వంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ మేరకు లోకాయుక్త ఏడీజీపీ మనీష్ ఖర్బీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు

సిఆర్‌పిసి సెక్షన్ 156(3) కింద సిద్ధరామయ్యపై కోర్టు కేసు నమోదు చేసింది. దీంతో పాటు సిద్ధరామయ్యపై ఐపీసీ 120బి, 166, 403, 420, 426, 465, 468, 340, 351 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును లోకాయుక్త పోలీసులు విచారించనున్నారు. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సిద్ధరామయ్యను విచారణకు పిలిచే అవకాశం ఉంది. అలాగే.. సిద్ధరామయ్యను అరెస్టు చేసే అధికారం లోకాయుక్తకు ఉంది. ఈ క్రమంలో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. అంతకంటే ముందే తన న్యాయ నిపుణుల సలహా మేరకు సిద్ధరామయ్య ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

Read Also: Israel-Iran: ఇజ్రాయెల్‌తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

ఫిర్యాదుదారు ఆర్టీఐ కార్యకర్త స్నేహమొయి కృష్ణ ఫిర్యాదు మేరకు సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు కారణంగా సిద్ధరామయ్య ఇబ్బందుల్లో పడ్డారని.. సీఎం పదవి నుంచి వైదొలగాలని ఆయనపై ఒత్తిడి వస్తోంది. దీనిని సిద్ధరామయ్య ఖండిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయబోనని సిద్ధరామయ్య చెప్పారు.