P20 Summit: జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్కు హాజరుకానున్న కెనడా.. ఈ దేశాలు పాల్గొనవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P20 Summit: అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల కెనడా చాలా మంది దౌత్యవేత్తలను భారతదేశం నుంచి బహిష్కరించింది. కెనడా దౌత్యవేత్తలను అనేక ఇతర దేశాలకు వారిని తరలించింది.
రెండు రోజుల జీ-20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం తెలిపారు. ఈ సదస్సులో 26 మంది అధ్యక్షులు, 10 మంది ఉపాధ్యక్షులు, 50 మంది ఎంపీలు, 14 మంది ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ అధ్యక్షుడు తొలిసారిగా భారతదేశంలో జరిగే పీ-20 ఈవెంట్కు హాజరవుతారు.భారత్లో జరగనున్న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో జర్మనీ, అర్జెంటీనా పాల్గొనవు. దీని వెనుక ఈ దేశాలు తమ అంతర్గత కారణాలను ప్రస్తావించి, కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశాయి.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: CEC: 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం
మరోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన తర్వాత భారత్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాస్తవానికి నిజ్జర్ హత్య వెనుక బహుశా భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే, కెనడా ప్రధాని ఆరోపణలను అసంబద్ధం, రాజకీయ ప్రేరేపితమని భారత్ తోసిపుచ్చింది. విలేకరుల సమావేశంలో లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ.. రెండు రోజుల కార్యక్రమంలో పీ-20 శిఖరాగ్ర సమావేశంతో సహా నాలుగు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని చెప్పారు. భారతదేశ పురాతన, భాగస్వామ్య ప్రజాస్వామ్య సంప్రదాయాలను హైలైట్ చేయడానికి ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది. 9వ పీ-20 సమ్మిట్ను భారత పార్లమెంటు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!