Supreme Court: ఆయుధం రికవరీ కాకపోతే నిందితులను దోషులుగా నిర్ధారించవచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. హత్య కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జూన్ 2018లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.అసలు ఇన్ఫార్మర్ను, ఇతర స్వతంత్ర సాక్షులను విచారించలేదని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు రుజువు కాలేదని, అందువల్ల నిందితులను నిర్దోషిగా ప్రకటించాలని నిందితుల తరఫు న్యాయవాది సమర్పించిన సమర్పణను అంగీకరించలేమని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆయుధం రికవరీ కాకున్నా.. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం ఉన్నప్పుడు నిందితులను నిర్దోషిగా విడుదల చేయడానికి వీలు లేదని ధర్మాసనం వెల్లడించింది. ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే ఆయుధం రికవరీ లేనప్పటికీ నిందితుడికి శిక్ష విధించవచ్చని చెప్పింది. ప్రాసిక్యూషన్ సాక్షుల్లో ఒకరు ప్రత్యక్ష సాక్షి అని, ఆయన ఈ కేసుకు పూర్తి మద్దతునిచ్చారని ధర్మాసనం పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన ధర్మాసనం, దోషులుగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు తీర్పును పునరుద్ధరిస్తూ వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013 ఆగస్టులో అరెస్టయిన నిందితులు ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ప్రయత్నించారని ధర్మాసనం పేర్కొంది.
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Supreme Court: ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదు..
ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితుడు బాధితుడితో పాటు ఇతరులు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నాడు. అతనిపై దాడి చేశాడు. దీని కారణంగా అతను గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. రాష్ట్రం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించిన సుప్రీంకోర్టు, నిందితులు ఆరు వారాల్లోగా సంబంధిత కోర్టు ముందు లేదా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. నిందితులు నిర్ణీత గడువులోగా లొంగిపోకపోతే, శిక్షను అనుభవించడానికి సంబంధిత కోర్టు లేదా పోలీసు సూపరింటెండెంట్ వారిని కస్టడీలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!