Supreme Court: ఆయుధం రికవరీ కాకపోతే నిందితులను దోషులుగా నిర్ధారించవచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. హత్య కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జూన్ 2018లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.అసలు ఇన్ఫార్మర్ను, ఇతర స్వతంత్ర సాక్షులను విచారించలేదని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు రుజువు కాలేదని, అందువల్ల నిందితులను నిర్దోషిగా ప్రకటించాలని నిందితుల తరఫు న్యాయవాది సమర్పించిన సమర్పణను అంగీకరించలేమని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆయుధం రికవరీ కాకున్నా.. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం ఉన్నప్పుడు నిందితులను నిర్దోషిగా విడుదల చేయడానికి వీలు లేదని ధర్మాసనం వెల్లడించింది. ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే ఆయుధం రికవరీ లేనప్పటికీ నిందితుడికి శిక్ష విధించవచ్చని చెప్పింది. ప్రాసిక్యూషన్ సాక్షుల్లో ఒకరు ప్రత్యక్ష సాక్షి అని, ఆయన ఈ కేసుకు పూర్తి మద్దతునిచ్చారని ధర్మాసనం పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన ధర్మాసనం, దోషులుగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు తీర్పును పునరుద్ధరిస్తూ వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013 ఆగస్టులో అరెస్టయిన నిందితులు ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ప్రయత్నించారని ధర్మాసనం పేర్కొంది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Supreme Court: ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదు..
ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితుడు బాధితుడితో పాటు ఇతరులు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నాడు. అతనిపై దాడి చేశాడు. దీని కారణంగా అతను గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. రాష్ట్రం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించిన సుప్రీంకోర్టు, నిందితులు ఆరు వారాల్లోగా సంబంధిత కోర్టు ముందు లేదా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. నిందితులు నిర్ణీత గడువులోగా లొంగిపోకపోతే, శిక్షను అనుభవించడానికి సంబంధిత కోర్టు లేదా పోలీసు సూపరింటెండెంట్ వారిని కస్టడీలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!