Supreme Court: ఆయుధం రికవరీ కాకపోతే నిందితులను దోషులుగా నిర్ధారించవచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. హత్య కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జూన్ 2018లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.అసలు ఇన్ఫార్మర్ను, ఇతర స్వతంత్ర సాక్షులను విచారించలేదని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు రుజువు కాలేదని, అందువల్ల నిందితులను నిర్దోషిగా ప్రకటించాలని నిందితుల తరఫు న్యాయవాది సమర్పించిన సమర్పణను అంగీకరించలేమని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆయుధం రికవరీ కాకున్నా.. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం ఉన్నప్పుడు నిందితులను నిర్దోషిగా విడుదల చేయడానికి వీలు లేదని ధర్మాసనం వెల్లడించింది. ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే ఆయుధం రికవరీ లేనప్పటికీ నిందితుడికి శిక్ష విధించవచ్చని చెప్పింది. ప్రాసిక్యూషన్ సాక్షుల్లో ఒకరు ప్రత్యక్ష సాక్షి అని, ఆయన ఈ కేసుకు పూర్తి మద్దతునిచ్చారని ధర్మాసనం పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన ధర్మాసనం, దోషులుగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు తీర్పును పునరుద్ధరిస్తూ వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013 ఆగస్టులో అరెస్టయిన నిందితులు ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ప్రయత్నించారని ధర్మాసనం పేర్కొంది.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
Supreme Court: ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదు..
ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితుడు బాధితుడితో పాటు ఇతరులు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నాడు. అతనిపై దాడి చేశాడు. దీని కారణంగా అతను గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. రాష్ట్రం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించిన సుప్రీంకోర్టు, నిందితులు ఆరు వారాల్లోగా సంబంధిత కోర్టు ముందు లేదా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. నిందితులు నిర్ణీత గడువులోగా లొంగిపోకపోతే, శిక్షను అనుభవించడానికి సంబంధిత కోర్టు లేదా పోలీసు సూపరింటెండెంట్ వారిని కస్టడీలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!