Site icon NTV Telugu

Cabinet Sub Committee : రాజధానిలో భూముల కేటాయింపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

Cabinet Sub

Cabinet Sub

Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది. అదేవిధంగా, కొత్తగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయింపు చేయడం, అలాగే అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం గురించి చర్చిస్తాయి.

Samsung: శాంసంగ్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌‌పై కీలక ప్రకటన

గతంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 120కి పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం, 115కి పైగా సంస్థలు ప్రభుత్వంతో సంప్రదించాయి, వీటిలో చాలామంది తమ భవన నిర్మాణాలను పునఃప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతి మహానగరానికి అభివృద్ధి పై ప్రభుత్వానికి రూ.3,445 కోట్ల నిధులు అంకితమయ్యాయి. ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చించి, రీటెండరింగ్ ప్రాసెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గతంలో ఎన్నో సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి, కానీ గత ప్రభుత్వం పనులను నిలిపివేసిన కారణంగా, నిర్మాణాలు అడ్డుకున్నాయి. కానీ ఇప్పుడు, కేటాయింపులు, నిర్మాణాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మంత్రులు ఈ సందర్భంగా, మరిన్ని సంస్థలు రాజధానిలో భూములు కేటాయించడానికి ఆసక్తి చూపనున్నాయని వెల్లడించారు. అదే సమయంలో, ప్రభుత్వం ప్రస్తుతం సీఆర్డిఏ పరిధిలో నిర్మాణ పనులు పునఃప్రారంభించగా, మరిన్ని సంస్థలు ముందుకు రావచ్చని అన్నారు. 18వ తేదీన, కేబినెట్ సమావేశంలో భూ కేటాయింపు, రీటెండరింగ్ ప్రక్రియపై పూర్తి చర్చ జరగనుంది.

Seethakka: స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..
 

Exit mobile version