Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి.
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ..
రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్ను విమానాశ్రయం (ఎయిర్పోర్ట్), ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్తో ఈ లైన్ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ‘వరల్డ్ పోలీస్ గేమ్స్ 2029’, ‘కామన్వెల్త్ గేమ్స్ 2030’లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు జోరందుకున్న సమయంలో దాదాపు 2,000 మందికి, అలాగే మెట్రో నిర్వహణ సమయంలో మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది. రూ. 1,299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. నగరంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకి తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం రూ. 1,235 కోట్ల వ్యయంతో ఆధునిక నివాస సముదాయాలను నిర్మించనున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు గుజరాత్లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత ఊతాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!