Byjus Raveendran: ఏడాది క్రితం రూ.17వేల కోట్లు.. ఇప్పుడు జీరో.. బైజూస్ రవీంద్రన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండేళ్ల కిందటివరకు కూడా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్., ఇప్పుడు మాత్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కంపెనీ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. బైజూస్ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే నమ్మండి. ఇదివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్ అధినేత రవీంద్రన్ సిద్ధపడ్డాడు. వాటితోపాటు అనేక విలువైన ఆస్తులను కూడా అమ్ముకున్నట్లు సమాచారం.
Also Read: Kishan Reddy: హైదరాబాద్లో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాదు..
Also Read
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
- TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
ఇకపోతే గత సంవత్సరం ఇదే సమయానికి ఆయనకు వేల కోట్లు ఉన్నాయి. అది కూడా 17 వేల కోట్లు విలువచేసే ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్ లో కూడా ఆయనకు స్థానం దక్కింది. అయితే రోజులన్నీ మనవి కాదు అన్నట్లుగా.. ఒక్క సంవత్సరంలోనే ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోట్ల అధిపతి నుండి ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితికి ఆయన చేరడం నిజంగా బాధపడాల్సిన విషయం. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో రవీంద్రనాథ్ నికర విలువ ఏకంగా ‘0’ కి పడిపోయినట్లు తెలిపింది.
Also Read: MP Navneet Kaur: ఎంపీ నవనీత్ కేసులో నేడు సుప్రీం తీర్పు..!
రవీంద్రన్ 2011లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ బైజూస్ ను స్థాపించిన విషయం మనకు వివిధమే. ఆన్లైన్ లో విద్య బోధన గురించి ఈ కంపెనీ తొలి రోజుల్లో మంచి ఆదరణ లభించకపోయిన ఆ తర్వాత కరోనా కారణంతో ఈ సంస్థ దశ పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉండి బైజుస్ లో ఉండే కంటెంట్ కు అలవాటు పడిపోయారు. దీంతో బైజూస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ కంపెనీ విలువ 2022లో ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఒక్కసారిగా ప్రపంచ కుబేరుల లిస్టులో చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం కేవలం ఒక్క బిలియన్ కన్నా తక్కువకు కంపెనీ వాల్యూ పడిపోయినట్లు ఫోర్బ్స్ తన తాజా రిపోర్ట్ లో తెలిపింది
తాజావార్తలు
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
-
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
-
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!