Byju’s CEO Tears: కన్నీటి పర్యంతమైన బైజూస్ సీఈవో.. ఇవేం కష్టాలు బాబోయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byju’s CEO Tears: జీవితం అన్ని సార్లు ఒకేళా ఉండదు.. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం.. ఒక్క గాలివానతో కూలిపోయినట్టు.. కొన్ని సార్లు తీరన్ని కష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు బైజూస్ సీఈవో రవీంద్రన్కు వచ్చింది.. ఈ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఓ వెలుగు వెలిగింది.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే భాషలో.. క్లిష్టమైన సబ్జెక్ట్ను కూడా అందుబాటులోకి తెచ్చిన బైజూస్.. తక్కువ కాలంలోనే ఎంతో మంది ఆదరణ పొందింది.. కొన్ని విద్యాసంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒప్పందాలు చేసుకునే స్థాయికి ఎదిగింది.. అయితే, ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం,ఆ సంస్థ నుంచి ఆడిటర్ వెళ్లిపోవడం.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. అంతేకాదు.. ఏప్రిల్ చివరల్లో బైజూస్ యొక్క బెంగళూరు కార్యాలయాలపై దాడి చేసిన కొందరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన విద్య-సాంకేతికత స్టార్టప్ను బహిరంగంగా విదేశీ మారకపు ఉల్లంఘనలతో ముడిపెట్టారు. ఇలా వరుసగా కష్టాల్లో చిక్కుకున్న రవీంద్రన్.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారట.
ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత దుబాయ్లో పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడారు రవీంద్రన్.. 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ గురించి ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది.. ఆ సమావేశంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్టు బ్లూమ్బెర్గ్ పేర్కొంది. కాగా, రవీంద్రన్ కొన్ని నెలల తరబడి సంక్షోభంలో ఉన్నారు. భారతదేశంలో ఈడీ చేసిన దాడితో పాటు, ఆర్థిక ఖాతాలను సకాలంలో ఫైల్ చేయడంలో విఫలమైంది. అనేక US-ఆధారిత పెట్టుబడిదారులు బైజూస్ అర బిలియన్ డాలర్లను దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి.. సంస్థ యొక్క తొలి పెట్టుబడిదారులలో ఒకరైన ప్రోసస్ ఎన్వి బోర్డు నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.. పేలవమైన ప్రదర్శనకు తోడు, డైరెక్టర్ల సలహాలను పట్టించుకోకపోవడం వల్లే బోర్డు నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
కాగా, కేరళలోని మారుమూల గ్రామంలో జన్మించిన రవీంద్రన్.. మొదట్లో బెంగళూరులో విద్యార్థులకు ట్యూషన్లు బోధించేవారు. అతడి బోధనా పద్ధతులు విద్యార్థులను ఇట్టే ఆకట్టుకోవడంతో తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన ఆయన.. బైజూస్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. అయితే, టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఎంట్రీతో బైజూస్ కు మంచి ఆధరణ లభించింది.. మొదట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.. ఇక, ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీలను సైతం బైజూస్ కొనుగోలు చేసింది. కానీ, 2022 తర్వాత బైజూస్కు కష్టాలు మొదలయ్యాయి. ఆన్లైన్ ట్యూషన్లకు ఆదరణ తగ్గడం.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో.. కొన్ని కంపెనీలు పెట్టుబడులకు ముఖం చాటేశాయి. అక్కడి నుంచి ఆ సంస్థను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. స్టార్టప్ ఫండింగ్ దెబ్బతినడంతో గత సంవత్సరం అది మారిపోయింది, 2023 మొదటి సగం నాటికి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది బైజూస్..
అయితే, పరిస్థితిని త్వరగా అదుపు చేయకపోతే మరియు బైజూస్లో రక్షణ కవచాలను ఏర్పాటు చేయకపోతే, అది విదేశీ ఫండ్స్లో పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం యొక్క ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది అని ఇన్క్రెడ్ క్యాపిటల్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చైర్మన్ జాకబ్ మాథ్యూ అన్నారు. రవీంద్రన్ ప్రైవేట్ ట్యూటర్ నుండి $22 బిలియన్ల కంపెనీ నాయకుడిగా ఎదగడం సీక్వోయా క్యాపిటల్, బ్లాక్స్టోన్ ఇంక్. మరియు మార్క్ జుకర్బర్గ్ ఫౌండేషన్తో సహా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించింది. మహమ్మారి సమయంలో, రవీంద్రన్ భారతదేశంలోని ఎడ్-టెక్ మార్కెట్లో ఎక్కువ భాగం మూలన పడింది. కానీ, తరగతి గదులు తిరిగి తెరిచిన తర్వాత, బైజూస్ ఆర్థిక స్థితి గురించిన ఆందోళనలు సంస్థ యొక్క ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు ఎందుకు రవీంద్రన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకంలో ఆలస్యం చేశారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా డజనుకు పైగా కంపెనీలను బ్రేక్-నెక్ స్పీడ్తో కొనుగోలు చేశారు. అనేక మంది ఉద్యోగులు నిష్క్రమించారు లేదా తొలగించబడ్డారు. బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. మరియు అనేక బోధనా కేంద్రాలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి కష్టల్లో పడిపోయిన రవీంద్రన్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం కావడం ఇప్పుడు వైరల్గా మారిపోయింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!