ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం.. బయటి నేతలు అంతా వెళ్లిపోవాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం క్లోజయింది. మైకులన్నీ మూగబోయాయి. బయటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. డబ్బు పంపిణీ జరుగుతోందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే సాగర్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాగర్ ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సీఈవో శశాంక్ గోయల్.. అధికారులతో సమీక్ష జరిపారు. పోలింగ్ సామాగ్రి, విధులు నిర్వర్తించే సిబ్బంది.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈసారి వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేశారు.
Also Read
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
- Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా కోవిడ్ పేషెంట్స్కు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.కోవిడ్ విజృంభణ కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించనున్నారు. మరో పక్క తిరుపతి ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. గెలిచి, సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ విజృంభణ నేపథ్యంలో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- Tags
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!