Butter and Ghee Adulteration: వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ ముఠాను ఛేదించిన అధికారులు..
- వెన్న
- నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్న అధికారులు
- దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లో ఘటన.
- 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు.
Manipur: మణిపూర్ సీఎం నివాసం దగ్గర భారీ అగ్నిప్రమాదం
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇక అధికారుల నివేదికల ప్రకారం.. జోగేశ్వరిలో నివాసం ఉంటున్న చమన్ షాము యాదవ్ (40), ఝమన్ షాము యాదవ్ (55) ఇద్దరినీ పామాయిల్, వనస్పతి, బటర్ కలర్, ఫ్లేవర్ ఏజెంట్లను కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరితోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అధికారులు కూడా దాడిలో సహాయం చేయడానికి సంఘటనా స్థలంలో ఉన్నారు. ఈ బృందం సైట్ నుండి పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి, సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో స్టీల్ ట్యాంక్, గరాటు, ప్లాస్టిక్ మగ్, కెటిల్, ఫ్లేవర్ బాక్స్, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ప్యాకింగ్ మెషిన్, అమూల్ స్వచ్ఛమైన నెయ్యి ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రి మొత్తం విలువ ఒక లక్ష ఇరవై వేల పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..
ఈ సందర్భంగా అధికారులు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐపిసి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇక అక్కడ తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..