Imaran Khan: ఇమ్రాన్ ఖాన్ వద్దకు బుష్రా బీబీ.. పాకిస్థాన్ కోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు.
బుష్రా బీబీ.. ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను అరెస్టు చేసిన తర్వాత తన నివాసాన్ని సబ్ జైలుగా ప్రకటించడంతో బనిగాలా నుండి అడియాలా జైలుకు తరలించాలని అభ్యర్థించారు. అధికారులు తన గోప్యతను ఉల్లంఘించారని, తన ఇంటి సెల్లో కలుషిత ఆహారాన్ని అందించారని బుష్రా బీబీ ఇస్లామాబాద్ హెచ్సికి చేసిన పిటిషన్లో తెలిపారు. బీబీ, తన న్యాయ బృందం కూడా సబ్-జైలుగా నిర్దేశించబడిన బనిగాలా నివాసంలో ప్రధానంగా పురుషులే ఉన్నారని పేర్కొన్నారు. ఈ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు. ఇస్లామాబాద్లోని ఖాన్కు చెందిన హిల్టాప్ మాన్షన్లో తాను ఒకే గదికి పరిమితమయ్యానని ఖాన్ భార్య ఆరోపించింది.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
Amit Shah: రాహుల్ గాంధీ నానమ్మ తిరిగి వచ్చినా అది సాధ్యం కాదు..
కాగా.. జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ గత వారం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు. తన ఉత్తర్వులో బనిగాలా అనే సబ్ జైలు నోటిఫికేషన్ ‘చెల్లదు’ అని ప్రకటించింది. ఈ క్రమంలో.. బుష్రా బీబీ అడియాలా జైలుకు తరలించాలని ఆదేశించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి 31న వీరిని అరెస్టు చేశారు. తోషాఖానా అవినీతి కేసులో అతని శిక్షను IHC సస్పెండ్ చేయగా, బుష్రా బీబీ ‘ఇస్లాంయేతర’ వివాహ కేసులో కస్టడీలో ఉన్నారు. ఖాన్ ఇతర కేసులలో కూడా దోషిగా ఉన్నారు.
పాకిస్థాన్లోని ఉన్నత న్యాయస్థానాల్లో తమపై ఉన్న వివిధ కేసులను సవాలు చేసిన బీబీ మరియు ఇమ్రాన్ ఖాన్లకు ఈ నిర్ణయం ఒక విజయం. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం నుండి తొలగించబడినప్పటి నుండి, రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ సైఫర్ (రహస్య దౌత్య సమాచారాలు) కేసుతో సహా కనీసం నాలుగు కేసుల్లో దోషిగా తేలాడు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!