KTR: ‘శ్వేతపత్రం’ తప్పుల తడక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Presentation On BRS Govt 9.6 Years Rule: ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ‘శ్వేతపత్రం’ తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించామని, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత తమ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా తాము దీటుగా సమాధానం చెప్పామని చెప్పుకొచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ.. తెలంగాణ భవన్లో స్వేదపత్రం పేరిట కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంకు కౌంటర్గా బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటీఆర్ మాట్లాడుతూ… ‘అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా స్వేదపత్రం విడుదల చేస్తున్నాం. కోట్ల మంది చెమటతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించాం. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత మాది. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఇప్పుడు సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసింది’ అని అన్నారు.
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
‘కరువులు, కల్లోల్ల తెలంగాణ ఆనాడు. 2014 ముందు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు వెనకబడ్డాయి. నల్లగొండ జిల్లాల్లో 90 శాతం మంది ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. ఎవరు లేరు తెలంగాణకు అని చెప్పిన నాయకులకు తొత్తులుగా మారిన ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఉద్యమంలో లేని నాయకులు ఈనాడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 2001 నుంచి ఉద్యమం చేసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన వైపు నడిపించారు. శ్వేత పత్రాలు అంటూ మళ్లీ జనాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఆర్ధిక చిక్కులు, రాజకీయ కుట్రలు, విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు, ఆస్తులు పంపిణీ, విద్యుత్ కోతలు, తాగు-సాగు నీటి కష్టాలు. వీటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్’ అని కేటీఆర్ చెప్పారు.
Also Read: Sabarimala Darshan 2023: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్ జామ్!
‘పటిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ సంస్కరణ దిశగా తెలంగాణ పయనించింది. 60 ఏళ్ల గత పాలన, ఆరునరేండ్ల పాలన బేరీజు వేసుకోండి. మేము పాలించింది ఆరునరెండ్లు మాత్రమే. ఎందుకంటే కరోనాతో రెండేళ్లు పోయింది. అన్ని సక్రమంగా చేసుకొని 2014 నుంచి ప్రగతి పథం వైపు తీసుకెళ్ళింది కేసీఆర్ ప్రభుత్వం. సివిల్ సప్లైలో 56 వేల కోట్లు అప్పు అనేది అబద్దం. ఈరోజు సివిల్ సప్లై వెబ్ సైట్ లో ఉన్నది 26 వేల కోట్లు. సివిల్ సప్లై దగ్గర 36 వేల కోట్ల ధాన్యం ఉంది. రిసీవనబుల్స్, స్టాక్స్ చూపకుండా కాంగ్రెస్ సర్కార్ తప్పుడు లెక్కలు చూపింది. 6 లక్షల 71 వేల కోట్లలో ఈ అప్పును కలిపారు’ కేటీఆర్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?