Gas Protest : గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Protest : మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది. అలాగే, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో.. కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ. 50 పెంచడం ఫై కేంద్రం ఫై నిప్పులు చెరుగుతున్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది.
Read Also: Dog Bite: కుక్క కరిస్తే ఏమి చేయాలి?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ మున్సిపాలిటీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్లలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపైపెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి వైఖరి మరియు పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా వారిపై భారం మోపుతూ వంట చేసుకునే పరిస్థితి లేదు అన్నారు. ఉజ్వల ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి సబ్సిడీ ఇవ్వక పోగా నెలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచుతుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక, పేద మధ్య తరగతి ప్రజలపై కక్ష గట్టి రాక్షతత్వం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వారన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!