BRS MP’s : బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎంపీలు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ పార్లమెంట్లో ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. అయితే.. ఈ రోజు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి అవిశ్వాస తీర్మానం ఇచ్చామని, మూడు రోజుల చర్చలో అరగంట సమయం కావాలని కోరామన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఓపికగా మేం విన్నామని, తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని సభలో వివరించామన్నారు.
Also Read : Jabardasth Varsha: రెడ్ స్కర్టులో జబర్దస్త్ వర్ష గ్లామర్ ట్రీట్.. చూస్తే తట్టుకోగలరా?
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ గురించి మాట్లాడలేదని, బండి సంజయ్ నోటికి వచ్చినట్లు, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వాళ్ళ పని అని, తెలంగాణ అంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. బండి సంజయ్ మాటలు సిగ్గు చేటని, రైతుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. కరెంట్ లేదంటే బండి సంజయ్ నీ రైతులు తరిమి కొడతారన్నారు.
Also Read : Sobitha Dhulipalla: వింత జాకెట్టులో శోభిత హాట్ ట్రీట్.. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!
అనంతరం బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బండి సంజయ్ తోక రాష్ట్రంలో కత్తిరించినా సరే మళ్లీ మోదీని పొగుడుతూ మార్కులు కొట్టేయాలని చూశారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆమె హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామనడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. బండి సంజయ్ బహిరంగ సభలో మాట్లాడినట్టు డ్రామా వేసినట్టు బఫూన్లా సభలో మాట్లాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలంగాణకు ఇచ్చిన స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ హామీల గురించి మాట్లాడకుండా విమర్శలకు దిగారని ఆమె విమర్శించారు.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!