కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ కుల గణన బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాగా, బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కుల జన గణన చేస్తారు.. ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు. కానీ కంటి తుడుపు చర్య లాగా తీర్మానం చేసి వదిలి వేసింది ఈ ప్రభుత్వం అన్నారు. దీనిని భారత జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది.. తీర్మానంలోనే క్లారిటీ లేదు, బీసీ సబ్ ప్లాన్ కు చట్ట బద్ధత చేయాలి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
Read Also: Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రూ.3వేల కోట్ల జరిమానా
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలు ఇప్పుడే గుర్తు వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. మేము కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాం.. మీకు ఇన్ని రోజులు బీసీలు ఎందుకు గుర్తు లేరు.. గతంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు.
Read Also: Mrunal Thakur: కొలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న మృణాల్.. ముగ్గురు హీరోల సినిమాల్లో ఛాన్స్..
అలాగే, తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.