MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..
- రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది..
- సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం.-ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. అనంతరం శాసన మండలి ఛైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తర్వాత శాసనమండలి మీడియా పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
Read Also: Minister Seethakka: బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వాళ్ళని వారి భూముల నుండి వెల్లగొట్టే కుట్రను ప్రభుత్వం చేస్తోందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి విమర్శించారు. నిన్న, ఈ రోజూ రైతుల పక్షాన మండలిలో నిరసన తెలిపామన్నారు. తమ భూములు లాక్కోవద్దు అని నినదించిన రైతులను రాష్ట్ర సర్కారు జైల్లో పెట్టిందన్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకురావడం ఈ ప్రభుత్వం వైఖరికి నిదర్శనమన్నారు. చేయని తప్పుకి రైతులు జైల్లో ఉన్నారన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని అడిగితే సభను వాయిదా వేస్తున్నారన్నారు. కరోనా సమయంలో మా నాయకుడు కేసీఆర్ రైతులను ఎలా ఆదుకున్నారో ప్రజలు గమనించాలన్నారు. గిరిజన రైతుల పక్షాన నిలబడుతాం, వారి సమస్యలు పరిష్కరించేవరకు విడిచిపెట్టమన్నారు.
Read Also: Alla Nani: ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..
బీఆర్ఎస్ ఈరోజు సభలో మానవీయ ప్రశ్నను లేవనెత్తిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. రైతును బేడీ వేసి హాస్పిటల్కి తెచ్చారని.. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యం మా ఏడో గ్యారెంటీ అన్న కాంగ్రెస్ ఇదేనా మీ ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడాలి అంటే టూరిజం పాలసీ మీద చర్చ చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజా పాలన? ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడన అంటూ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇనుపకంచెల రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. చెత్త పాలసీలు కాదు రైతుల గురించి చర్చిద్దాం అంటే సభను వాయిదా వేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!