MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..
- రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది..
- సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం.-ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. అనంతరం శాసన మండలి ఛైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తర్వాత శాసనమండలి మీడియా పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
Read Also: Minister Seethakka: బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వాళ్ళని వారి భూముల నుండి వెల్లగొట్టే కుట్రను ప్రభుత్వం చేస్తోందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి విమర్శించారు. నిన్న, ఈ రోజూ రైతుల పక్షాన మండలిలో నిరసన తెలిపామన్నారు. తమ భూములు లాక్కోవద్దు అని నినదించిన రైతులను రాష్ట్ర సర్కారు జైల్లో పెట్టిందన్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకురావడం ఈ ప్రభుత్వం వైఖరికి నిదర్శనమన్నారు. చేయని తప్పుకి రైతులు జైల్లో ఉన్నారన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని అడిగితే సభను వాయిదా వేస్తున్నారన్నారు. కరోనా సమయంలో మా నాయకుడు కేసీఆర్ రైతులను ఎలా ఆదుకున్నారో ప్రజలు గమనించాలన్నారు. గిరిజన రైతుల పక్షాన నిలబడుతాం, వారి సమస్యలు పరిష్కరించేవరకు విడిచిపెట్టమన్నారు.
Read Also: Alla Nani: ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..
బీఆర్ఎస్ ఈరోజు సభలో మానవీయ ప్రశ్నను లేవనెత్తిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. రైతును బేడీ వేసి హాస్పిటల్కి తెచ్చారని.. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యం మా ఏడో గ్యారెంటీ అన్న కాంగ్రెస్ ఇదేనా మీ ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడాలి అంటే టూరిజం పాలసీ మీద చర్చ చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజా పాలన? ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడన అంటూ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇనుపకంచెల రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. చెత్త పాలసీలు కాదు రైతుల గురించి చర్చిద్దాం అంటే సభను వాయిదా వేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!