BRS : రైతులను తక్షణమే ఆదుకోవాలి.. సీఎస్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగునీటి సదుపాయం లేకపోవడం, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పంట నష్టానికి ఎకరాకు రూ. 25,000 పరిహారం అందించాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా.. కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ. 500 బోనస్, రైతు భరోసా పెట్టుబడి మద్దతు మరియు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని కోరింది.
ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి జి. జగదీశ్రెడ్డి నేతృత్వంలోని బిఆర్ఎస్ శాసనసభ్యుల బృందం మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారికి వినతిపత్రం సమర్పించింది. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ , గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్రెడ్డి, సెరి సుభాష్రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
Also Read
అనంతరం తెలంగాణ భవన్లో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి, నీటి నిర్వహణలో అసమర్థత కారణంగా రైతులు తీవ్ర పంట నష్టపోయారని అన్నారు. వివిధ నీటి వనరులలో అవసరమైన నీరు ఉన్నప్పటికీ, సాగునీరు మరియు తాగునీటి అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు.
గత రెండు వారాలుగా బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను కలుస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. వారి అంచనా ఆధారంగా, రైతులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆయన కోరారు. ప్రజలు ముఖ్యంగా రైతులు పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నందున బీఆర్ఎస్ ఈ విషయంలో భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయదని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
-
Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!