R.S PraveenKumar: “పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి”
- రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న ఆర్ఎస్ ప్రవీణ్
- పోలీసుల పట్ల ప్రభుత్వం వైఖరి మారాలని సూచన
- కానిస్టేబుల్ భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణమన్న మాజీ ఎస్పీ
- రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలని తెలిపారు. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి అన్నారు. స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ కు పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తాననటం దారుణమన్నారు.
రేవంత్ సెక్యూరిటీ డ్యూటీ చేసే కానిస్టేబుల్స్ కూడా స్పెషల్ పోలీసులే అని గుర్తు చేశారు.
READ MORE: Flight Bomb Threats: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు.. ‘‘ఎక్స్’’పై కేంద్రం ఆగ్రహం..
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ రెడ్డి కానిస్టేబుల్స్ తో మాట్లాడాలని.. పాత పద్ధతిలో 15రోజులు డ్యూటీ చేస్తే.. 4రోజులు సెలవు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయని.. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో వృద్ధ దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదని.. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉందన్నారు. ఇది ప్రమాదకరమని.. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారన్నారు.
READ MORE: Cyclone Dana: తీరం వైపు దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!