Madhya Pradesh: మొన్న బీహార్లో నేడు ఎంపీలో.. వరుడు నల్లగా ఉన్నాడని పరారైన పెళ్లికూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్లో జరిగింది. మళ్లీ ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్. మధ్యప్రదేశ్లో పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ వధువు బ్యూటీ పార్లర్కు వెళ్లి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నా రాకపోవడంతో బంధువులు తీసుకెళ్లేందుకు వెళ్లారు. అక్కడ వారికి వధువు కనిపించకపోవడంతో.. షాకింగ్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్లోని ఓ పెద్ద ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతికి మధ్యప్రదేశ్లోని కొత్వాలి పరిధి మోరీనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు.
Read Also:SatyaPrem Ki Katha: వాహ్… మీ ఇద్దరి కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది డార్లింగ్స్
Also Read
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్కు వణుకు పుట్టించిన జపాన్..
- Harmanpreet Kaur History: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.! మిథాలీ రాజ్ రికార్డ్కు చెక్మెట్..
- IND W vs PAK W No Handshake: 'నో హ్యాండ్ షేక్'.. రికార్డ్ విజయం సాధించిన టీమిండియా ప్లేయర్స్ నేరుగా.?
మే 29న యోగేష్, శిల్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.. పెళ్లి జరగాల్సిన మే 29న ఇరు కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. మండపమంతా బంధు మిత్రులతో నిండిపోయింది. వరుడు కూడా తన వివాహ దుస్తులలో రెడీగా ఉన్నాడు. వివాహ తంతు ప్రారంభమైంది. వధువును తీసుకురావాలని చెప్పారు. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు శిల్పి బ్యూటీ పార్లర్కి వెళ్లింది. శిల్పి పెళ్లికి మేకప్ వేసుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. వస్తుందని ఓపికగా కాసేపు ఎదురు చూశారు. కానీ నిమిషాలు గంటలుగా మారాయి కానీ శిల్పి ఎక్కడా కనిపించలేదు.
Read Also:TSPSC: 80 మందికి ఏఈ పేపర్ అమ్మిన డీఈ రమేష్.. విచారణలో షాకింగ్ విషయాలు..!
వధువు బంధువులు బ్యూటీపార్లర్కు వెళ్లారు. కానీ వధువు లేదు. ఆమె రాలేదని అక్కడివారు చెప్పారు. షాక్కు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. వరుడు, అతని కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా వధువు అదృశ్యమైందని తెలిసి.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు 150 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా యువతి ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లింది అనేది మిస్టరీగా మారింది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి పందిరిలో కనిపించాల్సిన వధువు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన మధ్యప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.
- Tags
- bride
- groom
- refuse
- Uttar Pradesh
- wedding
తాజావార్తలు
-
RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Vaibhav Suryavanshi: ఒకరి తర్వాత ఒకరు.. 100 ఓవర్లు.. వైభవ్ కష్టాన్ని కళ్ళకు కట్టిన కోచ్!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!