Madhya Pradesh: మొన్న బీహార్లో నేడు ఎంపీలో.. వరుడు నల్లగా ఉన్నాడని పరారైన పెళ్లికూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్లో జరిగింది. మళ్లీ ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్. మధ్యప్రదేశ్లో పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ వధువు బ్యూటీ పార్లర్కు వెళ్లి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నా రాకపోవడంతో బంధువులు తీసుకెళ్లేందుకు వెళ్లారు. అక్కడ వారికి వధువు కనిపించకపోవడంతో.. షాకింగ్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్లోని ఓ పెద్ద ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతికి మధ్యప్రదేశ్లోని కొత్వాలి పరిధి మోరీనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు.
Read Also:SatyaPrem Ki Katha: వాహ్… మీ ఇద్దరి కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది డార్లింగ్స్
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
మే 29న యోగేష్, శిల్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.. పెళ్లి జరగాల్సిన మే 29న ఇరు కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. మండపమంతా బంధు మిత్రులతో నిండిపోయింది. వరుడు కూడా తన వివాహ దుస్తులలో రెడీగా ఉన్నాడు. వివాహ తంతు ప్రారంభమైంది. వధువును తీసుకురావాలని చెప్పారు. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు శిల్పి బ్యూటీ పార్లర్కి వెళ్లింది. శిల్పి పెళ్లికి మేకప్ వేసుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. వస్తుందని ఓపికగా కాసేపు ఎదురు చూశారు. కానీ నిమిషాలు గంటలుగా మారాయి కానీ శిల్పి ఎక్కడా కనిపించలేదు.
Read Also:TSPSC: 80 మందికి ఏఈ పేపర్ అమ్మిన డీఈ రమేష్.. విచారణలో షాకింగ్ విషయాలు..!
వధువు బంధువులు బ్యూటీపార్లర్కు వెళ్లారు. కానీ వధువు లేదు. ఆమె రాలేదని అక్కడివారు చెప్పారు. షాక్కు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. వరుడు, అతని కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా వధువు అదృశ్యమైందని తెలిసి.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు 150 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా యువతి ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లింది అనేది మిస్టరీగా మారింది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి పందిరిలో కనిపించాల్సిన వధువు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన మధ్యప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.
- Tags
- bride
- groom
- refuse
- Uttar Pradesh
- wedding
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!