Breaking News BJP MLAs are Protested at Telangana assembly gate: నేడు మొదలు కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మొదటిరోజే అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసుకు ప్లకార్డులు లోనికి అనుమతించలేదు. దింతో అక్కడ పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. చివరకి ప్లకార్డులు లేకుండా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించారు పోలీసులు.. దాంతో తప్పేది లేక ప్లకార్డులు వదిలేసి కాలి నడకన అసెంబ్లీ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇక ప్లే కార్డ్స్ పట్టుకున్నప్పుడు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.., రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి.., వరి ధాన్యాన్ని ఇస్తామన్న 500 బొనస్ ఏమైంది.? అంటూ నినాదాలు చేసారు.
IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
ఇంకా అలగే బేషరతుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి.. చనిపోయిన రైతులకు రైతు బీమా అమలు చేయాలి.. 15 వేల రైతు భరోసా ఎక్కడికి వెళ్ళింది..? రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఎక్కడ అంటూ నినాదాలతో ప్లార్డులు పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసారు.
Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!