Boy Traced: కాలువలో పడిన బాలుడి ఆచూకీ లభ్యం..కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కాలువలో పడిన బాలూడి ఆచూకీ కథ విషాదంగా మిగిలింది. కాలువలో పడిన బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు ఆచూకీ లభించింది. NAC కల్యాణమండపం వెనుక రోడ్ లో డ్రైన్ లో పడిపోయాడు అభిరామ్.. ఆయుష్ హాస్పటల్ సమీపంలో గుర్తించారు పోలీసులు..రెండున్నర కిలోమీటర్ల పాటు సైడు కాలువలో కొట్టుకువచ్చాడు అభిరామ్..బాలుడ్ని గుర్తించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే ఈ అన్వేషణ విషాదంగా ముగిసింది. డ్రైనేజీలో పడి రెస్క్యూ టీంకి దొరికినా.. కొన ఊపిరితో ఉన్నట్టు భావించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు అభిరామ్. దీంతో అభిరామ్ కుటుంబంలో విషాదం నెలకొంది. అభిరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు.
అసలేం జరిగిందంటే?
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
విజయవాడలోని గురునానక్ కాలనీలో గల డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు శుక్రవారం గల్లంతయిన సంగతి తెలిసిందే. బాలుడు అభిరామ్ కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో వర్షం కురిసింది.. దీంతో గురునానక్ కాలనీలో డ్రైన్ లో వరద నీరు పోటెత్తింది. వర్షం తగ్గిన సమయలో డ్రైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఆ సమయంలో డ్రైన్ లో వరద పోటెత్తింది. స్నేహితులు అభిరామ్ ను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కూడా డ్రైన్ లో కి దిగి అభిరామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా అభిరామ్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సంఘలన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా అతని ఆచూకీ లభించింది. రో వైపు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కార్పోరేషన్ నిర్లక్ష్యం కారణంగానే డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు కొట్టుకుపోయాడని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు. బాలుడి మృతిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Read Also:Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!