Germany: జర్మనీని హెచ్చరించిన బోట్సువానా.. దేనికంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీని ఆఫ్రికా దేశం బోట్స్వానా తీవ్రంగా హెచ్చరించింది. జర్మనీ ముచ్చటపడితే 20 వేల ఏనుగులను గిఫ్ట్గా ఇస్తామని బోట్సువానా అధ్యక్షుడు మోక్వీట్సీ మసిసి హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ హంటింగ్ ట్రోఫీలపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని ప్రతిపాదించింది. వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఈ చర్య చేపట్టింది. దీనిపై బోట్సువానా అధ్యక్షుడు మండిపడ్డారు. ఆ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2024: రికార్డులకు కలిసొచ్చిన తెలుగు రాష్ట్రాలు.. మొన్న హైదరాబాద్.. నేడు..
Also Read
తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతుందని మోక్వీట్సీ మసిసి ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంతతిని అదుపులో ఉంచడానికి వేట తప్పనిసరి అని మసిసి పేర్కొన్నారు. అవి జనావాసాలపైకి వచ్చి పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను కూల్చివేయడం చేస్తున్నాయని తెలిపారు. బోట్సువానా సమస్యల గురించి బెర్లిన్లో కూర్చొని చెప్పడం చాలా తేలిక అని.. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Man Risks Life: 100 కి.మీ వేగం, తలపై వేల వోల్టుల కరెంట్.. రైలుపై ప్రయాణించి బతికిపోయాడు..
బోట్సువానాలో మొత్తం లక్షా 30 వేల ఏనుగులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అత్యధికంగా జీవిస్తున్న తొలి మూడు దేశాల్లో ఇది కూడా ఒకటి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. అనంతరం స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్కు 5,000 ఏనుగులను ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..
ఈ ఏడాది మార్చిలో 10,000 ఏనుగులను పంపిస్తామని లండన్ను బోట్సువానా అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు అలాంటి గిఫ్టే జర్మనీకి కూడా ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలో హంటింగ్ ట్రోఫీలను అత్యధికంగా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం జర్మనీ. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బెల్జియం దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాయి. మరోవైపు మిసిసి వ్యాఖ్యలపై జర్మనీ ప్రతినిధి మాట్లాడుతూ బోట్సువానా తమ వద్ద ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Health Tips : మధుమేహానికి చెక్ పెట్టే సూపర్ జ్యూస్.. ఎలా తీసుకోవాలంటే?
- Tags
- 000 elephants
- 20
- Botswana
- germany
- send
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!