Botsa Satyanarayana: వేసవిలో జాగ్రత్తలు తీసుకోండి.. ఆ టీచర్ల మరణం బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడదెబ్బకు జనం బలవుతున్నారు. విధి నిర్వహణలో టీచర్ల ఆకస్మిక మరణం బాధాకరం అన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వేసవి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్పాట్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని .అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూ ముగ్గురు టీచర్ల ఆకస్మికంగా మరణించడం పట్ల విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పాఠాలు చెపుతూ ఒకరు, పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) విధులను నిర్వహిస్తూ ఇద్దరు ఇలా రెండు రోజుల్లో ముగ్గురు టీచర్లు విధి నిర్వహణలో మరణించడం చాలా బాధాకరమని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also:Bengal DGP: బెంగాల్ డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
శుక్రవారం నాడు పల్నాడు జిల్లాలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధులను నిర్వహిస్తూ జోజప్ప (స్పెషల్ అసిస్టెంట్), అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆకొండి బంగారయ్య అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఆకస్మికంగా మృతి చెందడం విచారకరమని అన్నారు. అలాగే గురువారం నాడు బాపట్లలో లెక్కల టీచర్ శ్రీనివాస రావు స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో మరణించడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియచేశారు. రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనూ, ఇతరత్రా విద్యా శాఖకు చెందిన అన్ని కార్యాలయాల్లో వేసవి ఎండలను తట్టుకునేలా తగిన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశిస్తూ, ఉపాధ్యాయులు కూడా వ్యక్తిగతంగా తమ ఆరోగ్య విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
Read Also: Crisis For Ashok Gehlot: గెహ్లాట్ సర్కార్ కు మరో తలనొప్పి.. రైతు ఆత్మహత్యతో సంక్షోభం
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..