IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!
- విమర్శలకు గురవుతున్న పాంటింగ్
- పాంటింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన లీ
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు. ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని తాను భావిస్తున్నా అని షేన్ లీ పేర్కొన్నాడు.
ఫాక్స్ క్రికెట్ పోడ్కాస్ట్ ‘ది ఫాలో ఆన్’లో షేన్ లీ మాట్లాడుతూ… ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. ఒక్కసారి విరాట్ కుదురుకున్నాడంటే.. ఆస్ట్రేలియాకు మరోసారి చుక్కలు చూపిస్తాడు. టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా. భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టుల్లోనే బాల్ టాంపరింగ్ వివాదం వచ్చింది. ఇప్పుడు కోహ్లీని ఉద్దేశించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆసీస్కు అద్భుత బౌలింగ్ ఎటాక్ ఉంది. కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్, లైయన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు’ అని అన్నాడు.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
Also Read: Gold Rate Today: ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ను భారత్ 0-3తో కోల్పోయింది. కివీస్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన రోహిత్ సేన.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆసీస్ చేరుకున్న భారత్.. ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. గత రెండుసార్లు భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!