Bomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికులు సురక్షితం
- చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
- ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేసినట్లు ఇండిగో ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది. చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 5149కి బాంబు బెదిరింపు వచ్చినట్లు ఇండిగో తెలిపింది. “ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది ప్రోటోకాల్ను అనుసరించారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారు. మేము భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నాము. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ల్యాండ్ చేయబడుతుంది.” అని ఎయిర్ లైన్స్ పేర్కొంది.
Read Also: Mercedes Car Accident : డెలివరీ బాయ్ మీదకి దూసుకెళ్లిన మెర్సిడెస్ కారు.. వైరల్ వీడియో
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం..
మంగళవారం విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు రావడంతో గుజరాత్లోని వడోదర, బీహార్లోని పాట్నా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబైలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామని బెదిరించారు. మంగళవారం, దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులతో కూడిన ఇమెయిల్లు వచ్చాయని తెలిసింది. భద్రతా సంస్థల విచారణ తర్వాత వాటిలో ప్రతి ఒక్కటి బూటకమని ప్రకటించబడింది. బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత విమానాశ్రయాలు ఆకస్మిక చర్యలను ప్రారంభించాయని, పరిశోధనలు నిర్వహించి, సంబంధిత బాంబు ముప్పు అంచనా కమిటీ సిఫారసుల మేరకు టెర్మినల్స్లో శోధించాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!