Bomb In Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb In Flight: ఢిల్లీ నుండి వడోదరకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు బుధవారం ప్రయాణికులలో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం., విమానంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ పై ఒక నోట్ గా “బాంబు” అనే పదాన్ని రాసి ఉండి గమనించడంతో ఈ సంఘటనకు కారణమైంది. విమానంలోని టాయిలెట్ లో ఆ నోట్ దొరికింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నోట్ దొరికిన తర్వాత విమానంలో సదరు అధికారులు వెతికారు. అయితే, అనుమానాస్పదంగా అక్కడ ఏమీ దొరకలేదు.
విమాన సిబ్బంది టిష్యూ పేపర్ ను గుర్తించినప్పుడు విమానం టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉందని ఒక అధికారి తెలిపారు. తదనంతరం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ప్రయాణీకులను విమానంలో నుండి దిగిపోవాలని కోరారు అధికారులు. అనంతరం ప్రయాణికులు మరో విమానంలో వడోదరకు బయలుదేరారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ సంఘటన తరువాత, ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో, “బయలుదేరే ముందు 15 మే 2024 న ఢిల్లీ నుండి వడోదరకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI819 లో నిర్దిష్ట భద్రతా హెచ్చరిక కనుగొనబడింది. అవసరమైన ప్రోటోకాల్ ను అనుసరించి ప్రయాణీకులందరినీ సురక్షితంగా తీసుకెళ్లామని., భద్రతా సంస్థల తప్పనిసరి తనిఖీల కోసం విమానాన్ని మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లారని తెలుపుతూ.. ఈ ఊహించని అంతరాయం వల్ల మా అతిథులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి గ్రౌండ్లోని మా సహచరులు నిర్ధారించుకున్నారని ఎయిర్లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా తన ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రత్యేక విమానంలో ప్రయాణికులను వడోదరకు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!