Jogulamba Gadwal: ఘోర ప్రమాదం.. నర్సింగ్ విద్యార్థులను డీకొన్న బోలెరో వాహనం.. ఇద్దరు మృతి
- నర్సింగ్ విద్యార్థులను డీకొన్న బోలెరో వాహనం
- ఇద్దరు మృతి
- ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడని వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నర్సింగ్ కాలేజ్ నుంచి హాస్టల్ కు వెళ్లే క్రమంలో బస్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Also Read:Kishan Reddy: పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోంది..
Also Read
గద్వాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థిణులు మృతి చెందడం పట్ల ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న అమ్మాయిలు, చిన్న వయసులోనే ఇలా మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని వారికి సూచించారు.
Also Read:Pak Hackers: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఇండియా సైట్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్..
ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మరో విద్యార్థినికి అవసరమైన వైద్య సాయం అందించాలని కలెక్టర్ను, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి ప్రకటించారు. మరణించిన విద్యార్థిణుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తాజావార్తలు
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో