Food Inflation: కేంద్రం దీపావళి కానుక.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Inflation: పండుగల సీజన్ ప్రారంభం కాకముందే పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తునే వేసింది. బియ్యంపై ఎగుమతి సుంకాన్ని వచ్చే ఏడాది వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు వ్యాపారులు బియ్యం ఎగుమతిపై మార్చి 31, 2024 వరకు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఆర్థిక శాఖ విడుదల చేయడం విశేషం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గత ఆగస్టు నెలలో బాయిల్డ్ రైస్ ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. బాయిల్డ్ రైస్ ఎగుమతిపై ఎగుమతి సుంకం అక్టోబర్ 16, 2023 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అంటే అక్టోబర్ 16 వరకు వ్యాపారులు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ దుర్గాపూజ, దీపావళి సమయంలో బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఎగుమతిపై విధించిన ఎగుమతి సుంకాన్ని 16 అక్టోబర్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు పెంచింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also:Thaman: బాలయ్య మత్తు నుంచి బయటకి వచ్చి… గుంటూరు కారం ఘాటు చూపించు
ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. బియ్యం ధరలను నియంత్రించేందుకు బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించాలని గతంలో మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశంలో బాస్మతీయేతర బియ్యం నిల్వలు పెరుగుతాయని, దీంతో ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో, ప్రభుత్వం పగిలిన బియ్యం ఎగుమతిని కూడా నిషేధించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏప్రిల్ – జూన్ మధ్య మొత్తం 15.54 లక్షల టన్నుల బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 11.55 లక్షల టన్నులు మాత్రమే. అంటే ఈ ఏడాది ఎక్కువ బియ్యం దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రిటైల్ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుతాయి.
Read Also:Congress First List: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!