BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?
- బీఎండబ్ల్యూ ఇండియా కీలక ప్రకటన
- జనవరి 1 నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
- రూ.56 లక్షల నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు.
దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ ఎం340ఐ మోడళ్ల ధరలను పెంచుతోంది. అంతేకాదు దిగుమతి చేసుకునే బీఎండబ్ల్యూ ఐ4, బీఎండబ్ల్యూ ఐ5, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ7 ఎం70, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎం2 కూపే, బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్, బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్, బీఎండబ్ల్యూ ఎం5, బీఎండబ్ల్యూ ఎం8 కంపిటీషన్ కార్లను ఇక్కడ విక్రయిస్తోంది. వీటి ధరలు కూడా 3 శాతం పెరగనున్నాయి. మన దగ్గర బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
Also Read: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్గా తిలక్ వర్మ రికార్డు!
మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ ఇప్పటికే ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ధరల పెంపు ఉంటుందని తెలిపింది. అన్నీ మోడల్ కార్ల ధరలు 3 శాతం పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు చెప్పింది. బెంజ్ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్యూవీ వరకు కార్లను బెంజ్ విక్రయిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!