Pakistan: పాకిస్థాన్లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి
- పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు
- ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మృతి
- సుమారు 150 మందికి తీవ్ర గాయాలు.
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. జూలైలో ఈ తెగల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జిర్గా గిరిజన మండలి పిలుపు మేరకు కాల్పుల విరమణ తర్వాత గొడవలు ముగిశాయి.
Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ గొడవలను రాజీ ద్వారా ముగించేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు రాజీ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే భారీ ఆయుధాలతో ఇంకా 10 ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ గొడవ మొదట భూ వివాదంగా ప్రారంభమైంది.. ఆ తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్లు, మత హింసతో కూడిన హింసగా మారాయి.ఈ గొడవల్లో 28 ఇళ్ళు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి.
Read Also: Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ మంది సున్నీలు ఉంటారు. అందువల్ల మైనారిటీ షియా ముస్లింలు ఇక్కడ వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. పాకిస్తాన్లోని మరో ముస్లిం సమాజమైన అహ్మదీయా కూడా హింసను ఎదుర్కొంటుంది. ఎందుకంటే సున్నీ సంఘం ప్రకారం.. అహ్మదీయ సమాజం ఇస్లాంను అనుసరించలేదు. ఒకరి కమ్యూనిటీ పట్ల మతోన్మాదం కారణంగా పాకిస్తాన్లో మతపరమైన అల్లర్లు జరుగుతాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో