Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం..
- సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారు
- దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం
- మోడీకి దేశప్రజలంతా అండగా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారు
- కాంగ్రెస్ నేతలు జైహింద్ ర్యాలీల పేరుతో పాక్ పాట పాడుతున్నారు
- కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తుంది
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు జైహింద్ ర్యాలీల పేరుతో పాకిస్థాన్ పాట పాడుతున్నారని ఆరోపించారు.
READ MORE: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
Also Read
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందని.. దేశభద్రత, విదేశాంగ వ్యవహారాలను కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిందని గుర్తు చేశారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే.. భారత జాతీయ కాంగ్రెస్ను.. కాస్తా పాకిస్థాన్ జాతీయ కాంగ్రెస్గా మార్చుకున్నట్లు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. హస్తం పార్టీది ఎప్పుడూ పాకిస్థాన్ అనుకూల విధానమే అని.. తొలి ప్రధాని నెహ్రూ నుంచి కాంగ్రెస్ ది హిందూ వ్యతిరేక విధానమే అని ఆరోపించారు. పాకిస్థానుతో యుద్ధం చేసిన ఇందిరాగాంధీ పీఓకే- పాక్ ఆక్రమిత కశ్మీరును ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదాలను ప్రధాని మోడీ సరిదిద్దుతున్నారన్నారు. కశ్మీరు విషయంలో అమెరికా జోక్యం చేసుకుందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని… యుద్ధాన్ని ఆపమని పాకిస్థాన్ ప్రాథేయపడిందన్నారు. ఉగ్రవాదాన్నీ అంతమొందించేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్తో అదిరే ఫీచర్లు!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
-
Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!