Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం..
- సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారు
- దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం
- మోడీకి దేశప్రజలంతా అండగా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారు
- కాంగ్రెస్ నేతలు జైహింద్ ర్యాలీల పేరుతో పాక్ పాట పాడుతున్నారు
- కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తుంది
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు జైహింద్ ర్యాలీల పేరుతో పాకిస్థాన్ పాట పాడుతున్నారని ఆరోపించారు.
READ MORE: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందని.. దేశభద్రత, విదేశాంగ వ్యవహారాలను కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిందని గుర్తు చేశారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే.. భారత జాతీయ కాంగ్రెస్ను.. కాస్తా పాకిస్థాన్ జాతీయ కాంగ్రెస్గా మార్చుకున్నట్లు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. హస్తం పార్టీది ఎప్పుడూ పాకిస్థాన్ అనుకూల విధానమే అని.. తొలి ప్రధాని నెహ్రూ నుంచి కాంగ్రెస్ ది హిందూ వ్యతిరేక విధానమే అని ఆరోపించారు. పాకిస్థానుతో యుద్ధం చేసిన ఇందిరాగాంధీ పీఓకే- పాక్ ఆక్రమిత కశ్మీరును ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదాలను ప్రధాని మోడీ సరిదిద్దుతున్నారన్నారు. కశ్మీరు విషయంలో అమెరికా జోక్యం చేసుకుందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని… యుద్ధాన్ని ఆపమని పాకిస్థాన్ ప్రాథేయపడిందన్నారు. ఉగ్రవాదాన్నీ అంతమొందించేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!